యాప్నగరం

KCR కంటే ముందే తెలంగాణ పోరాటం చేశా.. హైజాగ్ చేశారు: విజయశాంతి

Telangana BJP: బీజేపీ పార్టీలో చేరిన సినీ నటి విజయశాంతి.. సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ కంటే ముందే తాను తెలంగాణ కోసం పోరాడానని తెలిపారు. కేసీఆర్‌ది స్వార్థమని ఆరోపించారు.

Samayam Telugu 8 Dec 2020, 3:28 pm
సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి తన సొంత గూటికి చేరారు. సోమవారం (డిసెంబర్ 7) ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరారు. కాషాయ కండువాను కప్పి అరుణ్‌ సింగ్‌ ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విజయశాంతి.. కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ప్రచారం చేస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పైనా ఘాటు విమర్శలు చేశారు.
Samayam Telugu విజయశాంతి
Vijayashanthi


1998 జనవరి 26నే తాను బీజేపీలో చేరానని.. అలా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని విజయశాంతి తెలిపారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడానని చెప్పారు. కేసీఆర్ కంటే ముందే తాను తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యానని ఆమె వివరించారు.

కొంత మంది నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా 2005లో బీజేపీ నుంచి బటయకు వచ్చినట్లు విజయశాంతి తెలిపారు. అనంతరం ‘తల్లి తెలంగాణ పార్టీ’ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశానని చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు.

కేసీఆర్‌ది స్వార్థం..
‘తెలంగాణ ఉద్యమంలో తాను, తన కుటుంబసభ్యులు మాత్రమే ఉండాలనేది కేసీఆర్ స్వార్థం. ఈ ఆలోచనతోనే తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దాన్ని నేను వ్యతిరేకించా. ఆయన కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించానని తేల్చి చెప్పా. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్‌ను నా వద్దకు పంపించారు. పార్టీని విలీనం చేయాలని కోరారు. దీంతో విలీనం చేశా’ అని విజయశాంతి వివరించారు.

విజయశాంతి


కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిన రోజే కేసీఆర్‌ తనను టీఆర్‌ఎస్ నుంచి తొలగించారని విజయశాంతి చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరానని వివరించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్‌ పార్లమెంట్‌లో లేరని.. ఆయన సోనియా గాంధీ కాళ్ల మీద పడటానికి వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.

Must Read: కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌తో చేతులు కలిపారు.. ఇంకేం నిలదీస్తారు

Also Read: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.