యాప్నగరం

కరోనా బాధితుడి బర్త్ డే పార్టీ... హాజరైన మంత్రులు ఎమ్మెల్యేల్లో టెన్షన్

బర్త్ డే పార్టీ ఇచ్చిన రెండు రోజులకే నగల వ్యాపారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అతడ్నికార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా పాజిటివ్ రావడంతో అతడు తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందారు.

Samayam Telugu 5 Jul 2020, 9:52 am
హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. దాంతో నగరంలో పుట్టినరోజు వేడుకలు,పార్టీలు నిర్వహించకూడదని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమందిలో మాత్రం మార్పు రావటంలేదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ పార్టీలు, పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. దీంతో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువవుతోంది. తాజాగా హిమాయత్ నగర్ లో 63 ఏళ్ల ఓ వజ్రాల వ్యాపారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు బంగారు వర్తకులు కలిసి మొత్తం100 మందికిపైగా హాజరయ్యారు.
Samayam Telugu కరోనాతో నగల వ్యాపారి మృతి
hyderabad jeweller dies with corona


అయితే పార్టీ జరిగిన రెండురోజులు వ్యాపారి అస్వస్థతకు గురయ్యాడు. దగ్గు, ఆయాసంతో బాధపడుతుండడంతో ఓ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ముందు జాగ్రత్తగా అతడికి కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. దాంతో వ్యాపారి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పరిస్థితి అప్పటికే విషమించడంతో ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజే అతడు మరణించాడు. తర్వాత 5 రోజులకే పార్టీలో పాల్గొన్న జువెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా కరోనా తో మృతిచెందాడు. అంతే కాకుండా ఇప్పటివరకు పార్టీకి హాజరైన 20మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

అయితే ఈ వేడకకు తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు సమాచారం. దీంతో ఇప్పుడు వారిలో టెన్షన్ మొదలయ్యింది. విషయం బయటకు రాకుండా బర్త్ డే పార్టీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు రహస్యంగా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.