యాప్నగరం

బోరబండలో మళ్లీ భూ ప్రకంపనలు.. ఈసారి మరింత పెద్దగా శబ్దాలు

Borabanda: ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారీ శబ్ధాలు వస్తుండంతో జనం భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భారీ శబ్ధాలతో 4 సెకన్ల పాటు భూమి కంపించింది.

Samayam Telugu 4 Oct 2020, 8:35 pm
హైదరాబాద్‌లోని బోరబండలో మళ్లీ భూప్రకంపనలు బీభత్సం రేపాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతూ బయటకు పరుగులు తీశారు. రెండ్రోజుల క్రితం వచ్చిన శబ్దాలు, ప్రకంపనల కన్నా ఇప్పుడు అధికంగా రావడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారీ శబ్ధాలు వస్తుండంతో జనం భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భారీ శబ్ధాలతో 4 సెకన్ల పాటు భూమి కంపించింది.
Samayam Telugu బోరబండలో మళ్లీ భూ ప్రకంపనలు
borabanda


అయితే, ఈ ప్రకంపనలు, శబ్దాలపై భూగర్భ నిపుణులు స్పందించారు. రహమత్‌నగర్‌, బోరబండ ప్రాంతాల్లో వచ్చిన భూ ప్రకంపనలు సహజమైనవేని ఎన్జీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్త శ్రీనగేష్‌ చెప్పారు. ఈ కదలికలు, శబ్దాల వల్ల ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశమే లేదని భరోసా కల్పించారు. భూమి లోపలిపొరల్లోకి నీరు చేరుతున్న వేళ ఇలాంటి శబ్దాలు రావడం సహజమేనని ఆయన చెప్పారు.

బోరబండలో భూకంపాలపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ఆయన చెప్పారు. అయితే, సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం వెల్లటూరులో ఇప్పటి వరకూ 1,600 సార్లు భూమి కంపించిందని గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.