యాప్నగరం

కల్వకుంట్ల ఫ్యామిలీకి సేవ చేస్తే అడ్రస్ గల్లంతే.. వాడుకొని వదిలేస్తారు: సంపత్

Telangana Congress: కోదండరాం నుంచి హరీష్ రావు వరకు అనేక మందిని వాడుకొని వదిలేశారని, వారికి సేవ చేసిన ఎంతో మంది నాయకులు అడ్రెస్ లేకుండా పోయారని సంపత్ వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 19 Jul 2020, 10:09 pm
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు కల్వకుంట్ల కుటుంబ సేవ‌లో ఉంటే అధోగతి పాల‌వుతార‌ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. వారంతా ఓ సారి చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఇటీవల కొంతమంది మంత్రులు విర్రవీగుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని, లాంటి వారిని ఆ కుటుంబం వాడుకొని వదిలేస్తుందని విమర్శించారు. ఆదిలాబాద్‌లో జోగు రామన్న, మహబూబ్ నగర్‌లో లక్ష్మారెడ్డి, జూపల్లి, ఖమ్మంలో తుమ్మల, హైద‌రాబాద్‌లో నాయిని, చందూలాల్, వరంగల్‌లో కడియం ఇలా అనేక మందిని కల్వకుంట్లవారు మోసం చేశారని విమర్శించారు.
Samayam Telugu సంపత్ కుమార్
aicc secretary sampath kumar


చివరికి బీసీ నాయకులుగా ఉన్న మధుసూదన్ చారి, స్వామి గౌడ్‌ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలికారు. కోదండరాం నుంచి హరీష్ రావు వరకు అనేక మందిని వాడుకొని వదిలేశారని, వారికి సేవ చేసిన ఎంతో మంది నాయకులు అడ్రెస్ లేకుండా పోయారని సంపత్ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణలో విఫలమై అధికారులను కూడా బలి చేశారని సంపత్ ఆరోపణలు చేశారు.

ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారిణులు శాంతి కుమారి, యోగితా రాణాలను టీఆర్ఎస్ నేత‌లు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులు ప్రజలకోసం పని చేయాలా.. లేక కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం పని చేయాలా అని ప్రశ్నించారు. మంత్రులు ప్రజలకు చక్కని సేవ చేస్తూ ప్రజల హృదయాలలో నిలిచిపోవాలని, అంతేకానీ, కల్వకుంట్ల కుటుంబానికి కాపలాగా ఉంటూ తమ ప్రతిష్ఠను దెబ్బతీసుకోవద్దని హితవు పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.