యాప్నగరం

మజ్లిస్ పార్టీ రూటే సపరేటు.. మేనిఫెస్టోలు, బుజ్జగింపుల్లాంటివి ఎందుకు ఉండవ్?

AIMIM: పొద్దున, సాయంత్రం పాదయాత్రలే జరుగుతాయి. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే బహిరంగ సభలు జరడం గమనించవచ్చు. అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ తమ వాగ్ధాటితో ప్రజల్ని ఆకట్టుకుంటారు.

Samayam Telugu 27 Nov 2020, 6:15 pm
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం). హైదరాబాద్ పాతబస్తీలోని రాజకీయాలను శాంసించే ఈ పార్టీ మిగతా రాజకీయ పార్టీల్లా మాత్రం కాదు. జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నా ఇతర పార్టీలకీ దీనికి చాలా తేడాలు ఉన్నాయి. వీరు ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించరు. ఏ నిర్ణయమైనా పార్టీ అధినేతదే తుది నిర్ణయం. బుజ్జగింపులు, లీడర్ల తిరుగుబాట్లు, ఇతర సర్దుబాట్లు ఎక్కడా కనిపించవు. ఆ పార్టీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కవు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Asaduddin Owaisi


ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం ఒక మోసమని, అది ప్రజల్ని మోసం చేసే పత్రమని మజ్లిస్ పార్టీ అభిప్రాయం. ఈ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఎప్పటి మాదిరిగానే మజ్లిస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయలేదు. 2009 ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2002 లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో దివంగత నేత సలావుద్దీన్‌ హైదరాబాద్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిటడాక్యుమెంట్‌ను విడుదల చేశారు.

ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో సైతం ఆచితూచి వ్యవహరిస్తారు. పాదయాత్రకు లేదా గడప గడపకు ప్రచారం చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పొద్దున, సాయంత్రం పాదయాత్రలే జరుగుతాయి. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే బహిరంగ సభలు జరడం గమనించవచ్చు. ఈ సభల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌, మరో నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తమ వాగ్ధాటితో ప్రజల్ని ఆకట్టుకుంటారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతారు.

Also Read: కేసీఆర్.. నువ్వు అదే అయితే పాతబస్తీలో సభ పెట్టు: బండి మరో సవాల్

2009 ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట పార్టీ ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. అంతకుముందు 2002 మున్సిపల్‌ ఎన్నికల్లో దివంగత నేత సలావుద్దీన్‌ హైదరాబాద్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరుతో ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.

ఎన్నికల్లో మజ్లిస్‌ పరిమితమైన స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుంటుంది. ఈ సారి 51 డివిజన్లకు అభ్యర్థులను బరిలో దింపింది. గత ఎన్నికలోల 60 డివిజన్లకు పోటీ చేసి 44 స్థానాలను దక్కించుకుంది. అందులో సమారు 16 మంది సిట్టింగ్‌ కార్పొరేటర్‌లకు మళ్లీ టికెట్ ఇవ్వలేదు. అయినా వారిలో ఎలాంటి అసంతృప్తి, అలకలు లేకుండా చర్యలు తీసుకుంటారు. అసలు రెబెల్స్ అనే మాటే దాదాపు మజ్లిస్ పార్టీలో వినిపించదు. పార్టీ అధినేతదే తుది నిర్ణయంగా ఉంటుంది.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.