సమ్మెపై ప్రభుత్వం మొండివైఖరితో తీవ్ర మనస్థాపానికి గురై ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె అనూహ్య మలుపు తిరిగింది. డ్రైవర్ మృతికి నిరసనగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్కు కాంగ్రెస్, టీజేఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరోవైపు, బలిదానం చేసిన శ్రీనివాసరెడ్డికి అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఆర్టీసీ డ్రైవర్ మృతి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంలో పలు డిపోల ఎదుట వంటా వార్పు నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. ఇక, కరీంనగర్ బస్టాండ్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇప్పటికైనా తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతికి పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, సీపీఐ జాతీయ నేత నారాయణ, ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి డీఆర్డీవో అపోలో హాస్పిటల్ వద్దకు చేరుకుని, శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డ్రైవర్ శ్రీనివాస్ మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడొద్దని లక్ష్మణ్ భరోసా ఇచ్చారు.
శ్రీనివాస్రెడ్డి మృతి చాలా బాధాకరమని... ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతోందనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లిస్తే ఆర్టీసీ ఎందుకు అప్పులుపాలైందని ఆయన ప్రశ్నించారు.
కార్మికులను రెచ్చగొట్టే ప్రకటనలను కేసీఆర్ ఇప్పటికైనా మానుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. ఎవరూ బలిదానాలకు పాల్పడవద్దని.. ఆత్మగౌరవంతో పోరాడుతున్నామని.. అంతిమ విజయం మనదేనని అన్నారు. డీఆర్డీవో అపోలో హాస్పిటల్ వద్దకు భారీగా జనం చేరుకుంటున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఆర్టీసీ డ్రైవర్ మృతి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంలో పలు డిపోల ఎదుట వంటా వార్పు నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. ఇక, కరీంనగర్ బస్టాండ్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇప్పటికైనా తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతికి పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, సీపీఐ జాతీయ నేత నారాయణ, ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి డీఆర్డీవో అపోలో హాస్పిటల్ వద్దకు చేరుకుని, శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డ్రైవర్ శ్రీనివాస్ మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడొద్దని లక్ష్మణ్ భరోసా ఇచ్చారు.
శ్రీనివాస్రెడ్డి మృతి చాలా బాధాకరమని... ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతోందనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లిస్తే ఆర్టీసీ ఎందుకు అప్పులుపాలైందని ఆయన ప్రశ్నించారు.
కార్మికులను రెచ్చగొట్టే ప్రకటనలను కేసీఆర్ ఇప్పటికైనా మానుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. ఎవరూ బలిదానాలకు పాల్పడవద్దని.. ఆత్మగౌరవంతో పోరాడుతున్నామని.. అంతిమ విజయం మనదేనని అన్నారు. డీఆర్డీవో అపోలో హాస్పిటల్ వద్దకు భారీగా జనం చేరుకుంటున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.