యాప్నగరం

జగన్ మనసు మార్చండి.. మేడారంలో అమరావతి రైతులు పూజలు

Amaravati Farmers: ఈ సందర్భంగా అమరావతి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మను దర్శించుకొనేందుకు జాతరకు వచ్చినట్లు రైతులు వెల్లడించారు.

Samayam Telugu 8 Feb 2020, 1:35 pm
అమరావతి రైతులు మేడారం జాతరకు విచ్చేశారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులు వద్దని, అమరావతే ముద్దని అమ్మవారిని వేడుకున్నారు. తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని కోరుతూ నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మను దర్శించుకొనేందుకు జాతరకు వచ్చినట్లు రైతులు వెల్లడించారు.
Samayam Telugu Capture


శుక్రవారం రైతులంతా అమరావతి నుంచి ప్రత్యేక బస్సులో మేడారానికి బయల్దేరారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 53వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడిలో అమరావతికి అనుకూలంగా, 3 రాజధానులకు వ్యతిరేకంగా రైతుల ధర్నాలు కొనసాగిస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు ముమ్మరం

మరోవైపు, వెలగపూడిలో రవి, శ్రీకర్ అనే వ్యక్తులు చేపట్టిన 151 గంటల నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. స్థానిక వైద్య సిబ్బంది ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. 53 రోజులుగా అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మక్క, సారలమ్మ దర్శించుకొని రాజధాని తరలింపును ఆపాలని కోరుకొనేందుకు మేడారం వచ్చినట్లు రైతులు చెప్పారు. ఈ సందర్భంగా జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు.

Also Read: మేడారం అంశాన్ని ప్రధానికి చెప్తా.. వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.