యాప్నగరం

Hyderabad Coronavirus: హైదరాబాద్‌లో మరో వృద్ధుడికి కరోనా పాజిటివ్

Hyderabad నగరంలో 70 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఇటీవలే ఇతడు అమెరికా నుంచి తిరిగొచ్చాడు.

Samayam Telugu 29 Mar 2020, 5:16 pm
హైదరాబాద్ నగరంలో మరో వృద్ధుడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. మదీనగూడ మైత్రీనగర్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌‌గా తేలినట్లు సమాచారం. అధికారులు దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది. సదరు వృద్ధుడు మార్చి 14న అమెరికా నుంచి నగరానికి తిరిగొచ్చారు. 22వ తేదీ నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో 26న అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి నమూనాలు పరీక్షలకు పంపించగా.. ఆదివారం కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం.
Samayam Telugu Hyderabad


అప్రమత్తమైన అధికారులు వృద్ధుడి కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల కోసం తరలించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు వారి పని మనిషి, ఆమె కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

కరోనాతో హైదరాబాద్‌లో శనివారం ఓ వృద్ధుడు మరణించిన సంగతి తెలిసిందే. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల ఓ వ్యక్తి సైఫాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. అతడు మరణించిన తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో కరోనా తొలి మరణం ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో శనివారం రాత్రికి మొత్తం 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Also Read: వైన్స్ తెరుస్తారా.. ఆ జీవో ఏంటి?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.