యాప్నగరం

వ్యవసాయాధికారికి లాఠీ దెబ్బలు.. దుబ్బాకలో పోలీసుల దురుసుతనం

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో పోలీసులు ఓ వ్యవసాయ అధికారిపై లాఠీ ఝులిపించారు. ఆయన వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా లాఠీ దెబ్బలు రుచి చూపించారు.

Samayam Telugu 22 Apr 2020, 10:57 pm
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించగా.. చాలా మంది నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారం అవుతోంది. కొన్ని చోట్ల పోలీసులు నింబంధనలను అతిక్రమించిన వారిపై లాఠీ ఝులిపించిన ఘటనలు వెలుగు చూశాయి. దీంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు కూడా.. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఎంతో ఓపికతో విధులు నిర్వర్తిస్తున్నారు. అనవసరంగా రొడ్డెక్కిన వారికి చిన్న చిన్న పనిష్మెంట్లు విధిస్తున్నారు.
Samayam Telugu dubbaka


కానీ కొందరు పోలీసులు మాత్రం ఇప్పటికీ అత్యుత్సాహంతో ఎదుటి వ్యక్తి చెబుతున్న దాన్ని కూడా పట్టించుకోకుండా లాఠీలకు పని చెబుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగొస్తున్న అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (ఏఈవో)కు పోలీసులు లాఠీ దెబ్బ రుచి చూపించారు.

బైక్ మీద వెళ్తున్న ఏఈవో సురేందర్‌ను ఆపిన పోలీసులు.. ఐడీ ప్రూఫ్ చూపించినా లాఠీలతో ఆయన్ను కొట్టారని సమాచారం. ఆయన అడ్డుకుంటున్నప్పటికీ.. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీశారు. రైతులకు అండగా ఉంటున్న తోటి ఏఈవోను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన సహచర ఏఈవోలు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏఈవో... ఎస్సైతోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లపై సిద్ధిపేట సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ సంబంధ పనులు చేసుకోవడానికి లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. కానీ వ్యవసాయ అధికారిపై పోలీసులు చేయి చేసుకోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.