యాప్నగరం

గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం కప్పు.. 10 మందికి తీవ్ర గాయాలు

Gachibowli: భవనం పైకప్పు కూలిన సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 4 Oct 2020, 9:01 pm
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనం కూలడం కలకలం రేపుతోంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ భవనం కూలడంతో దాదాపు 10 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఆదివారం గచ్చిబౌలి పరిధిలో జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న భవనంలోని రెండో అంతస్తులో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో శిథిలాలు పడి దాదాపు పది మంది కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. ఈ 10 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Samayam Telugu పైకప్పు కూలిన భవనం
building slab collapsed in gachibowli


భవనం పైకప్పు కూలిన సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పై కప్పు కూలిన ఘటనలో బాధితులైన కూలీలను శ్రవణ్, సురేష్, రాజన్ కుమార్, రాజ్ కుమార్, జయప్రకాష్, రామ్ సింగ్, సందీప్, సాకర్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అయితే, పైకప్పు కూలినందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.