యాప్నగరం

ప్రగతి భవన్‌లో సీఎం వైఎస్ జగన్, సీఎం కేసీఆర్ భేటీ

CM KCR: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఏపీలో రాజధాని అంశం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎంల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Samayam Telugu 13 Jan 2020, 6:04 pm
పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సోమవారం (జనవరి 13) మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఇరువురు సీఎంల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర ఆంశాలపై చర్చించే అవకాశం ఉంది. తాజా రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానుల అంశం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu cms meet


విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన, ఇతర పెండింగు అంశాలపైనా ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్‌ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం.

ఇద్దరు సీఎంలు గతంలో మూడు సార్లు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో లంచ్ తర్వాత భేటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: కూర‘గాయా’లు, పప్పులు, నూనెలు అన్నీ పైపైకి.. సంక్రాంతి వేళ సామాన్యుడికి ధరాఘాతం

ప్రగతి భవన్ చేరుకున్న వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.