యాప్నగరం

హైదరాబాద్‌లో మరో 45 బస్తీ దవాఖానాలు.. తలసాని వెల్లడి

Govt Hospitals: కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానాలతో అదనంగా మరో 4 వేల మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఒక్కో బస్తీ దవాఖానాలో ఓ డాక్టర్‌తో పాటు నర్సు, సహాయకుడు ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివరించారు.

Samayam Telugu 20 May 2020, 4:00 pm
పేద, మధ్య తరగతి వారి సౌలభ్యం కోసం మే 22 నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో 22, మేడ్చల్‌ జిల్లాలో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో 3 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకూ గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ దవాఖానాల వల్ల ప్రతి రోజూ పది వేల మందికి వైద్య సౌకర్యాలు అందుతున్నాయని వెల్లడించారు. బుధవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani


కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానాలతో అదనంగా మరో 4 వేల మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఒక్కో బస్తీ దవాఖానాలో ఓ డాక్టర్‌తో పాటు నర్సు, సహాయకుడు ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.