యాప్నగరం

హైదరాబాద్: మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

విషగుళికలు మింగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికుడు. రాణిగంజ్ బస్ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తోన్న షేక్ బాబా. ఆర్టీసీ సమ్మె, తర్వాతి పరిణామాలపై బాబా మనస్థాపం.

Samayam Telugu 7 Nov 2019, 12:33 pm
హైదరాబాద్ శివారులో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. డబీర్‌పురాలో ఆర్టీసీ మెకానిక్ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయగా.. తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. రాణిగంజ్ బస్సు డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న కార్మికుడు షేక్ బాబా సమ్మె, తర్వాతి పరిణామాతో మనస్థాపంతో ఉన్నాడు. కుటంబ సభ్యులకు విషయాన్ని చెప్పి ఎన్నోసార్లు బాధపడ్డాడు. దీంతో వారు కూడా బాబాకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు.
Samayam Telugu suicide.


ఏం జరిగిందో ఏమో.. గురువారం ఉదయం బాబా విషగుళికలు తాగాడు.. అపస్మారక స్థితిలో అతడ్ని గమనించిన తోటి ఆర్టీసీ కార్మికులు సుచిత్రలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. బాబాను ఆర్టీసీ జేఏసీ కార్మికులు పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.