యాప్నగరం

అఖిలప్రియ కాదట, తెరపైకి మరో సూత్రధారి! కిడ్నాప్ కేసు మరో సంచలన మలుపు

Bowenpally Kidnap Case: ఈ కేసులో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. సిద్దార్థ అనే వ్యక్తి విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తున్నాడు. అఖిలప్రియ, భార్గవ్‌కు పర్సనల్‌ గార్డ్‌గా ఉంటున్నాడు.

Samayam Telugu 15 Jan 2021, 10:45 pm
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సిద్దార్థ అనే వ్యక్తి ఈ మొత్తం కిడ్నాప్‌ వ్యవహారంలో కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. భార్గవ రామ్‌కి మనుషులను సరఫరా చేసింది కూడా ఇతడేనని విచారణలో వెల్లడైంది.
Samayam Telugu అఖిలప్రియ (ఫైల్ ఫోటో)
Bhuma akhilapriya


సిద్దార్థ అనే వ్యక్తి విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తున్నాడు. అఖిలప్రియ, భార్గవ్‌కు పర్సనల్‌ గార్డ్‌గా ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఐటీ తనిఖీల కోసం రావాలని భార్గవ్ సిద్దార్థకు చెప్పినట్లు తెలుస్తోంది. భార్గవ్‌ ఆదేశం మేరకు సిద్దార్థ్ 15 మందితో హైదరాబాద్‌కు వచ్చాడని.. సిద్దార్థ అండ్‌ గ్యాంగ్‌ ముగ్గురిని కిడ్నాప్‌ చేసి వెళ్లిపోయిందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం సిద్దార్థతో పాటు అతడి గ్యాంగ్‌లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. వీరు గోవాలో ఉన్నట్లుగా కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. భార్గవ రామ్‌ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణె నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు ఉన్న హోటళ్లపై పోలీసులు దాడి చేసేందుకు కొద్దిసేపటి ముందే ముందస్తు వ్యూహంతో జారుకున్నట్లు తెలుస్తోంది. జగద్విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్‌ తదితరుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.