యాప్నగరం

సీఎంలు జగన్, కేసీఆర్ భేటీ..

ప్రగతి భవన్‌లో తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చించారు.

Samayam Telugu 23 Sep 2019, 10:50 pm
హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు దేశంలో తాజా రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించారు.
Samayam Telugu cms


రాయలసీమతో పాటు పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే అంశంపై ఇరువురు సీఎంలు ప్రధానంగా దృష్టి సారించారు. సీఎం కేసీఆర్‌, జగన్‌.. ఇప్పటికే పలుమార్లు సమావేశమై ఈ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపై ఈ భేటీలో ఇద్దరు సీఎంలు చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలపై చర్చలు జరిపారు.

మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్రం సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. సీఎం జగన్, కేసీఆర్ తొలిసారిగా జూన్‌ 28న సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 2న సీఎంలు ఇద్దరూ మరోసారి భేటీ అయ్యారు. తాజాగా మూడోసారి భేటీ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.