యాప్నగరం

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఏపీ వ్యక్తి అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్

అతడు చేసిన మెసేజులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొందరికి వచ్చాయి. దీంతో ఈ ఫేక్ న్యూస్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

Samayam Telugu 17 Dec 2020, 9:37 am
కరోనా వైరస్ కేసులు ఇంకా దేశ వ్యాప్తంగా నమోదు అవుతూనే ఉన్నాయి. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అటు... డాక్టర్లు, ఇటు అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కరోనా గురించి ఎలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయవద్దని పోలీసులు సైతం హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏపీ కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన సాదిక్ బాష వృత్తిరీత్యా ఆటో డ్రైవర్.
Samayam Telugu సోషల్ మీడియాలో దుష్ప్రచారం
fake message on social media


Read More: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్... నోటీసులు అందించిన పోలీసులు

ఈనెల 13న రాత్రి 9 గంటల సమయంలో సాదిక్ బాష సెల్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. కరోనా మరోసారి విరుచుకుపడుతోందని... కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని అందులో ఉంది. దీంతో ఈ విషయాన్ని వెంటనే సాదిక్ బాష తన బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు పంపించాడు. సదురు మెసేజ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు చేరింది. అయితే తప్పుడు సమాచారాన్ని అందరికీ పంపించి... ప్రజల్లో భయాందోళనకు గురి చేసినందుకు సాదిక్ బాషపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేయవద్దని చెబుతున్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.