యాప్నగరం

Davos Summit: లండన్ తర్వాత హైదరాబాద్‌లోనే.. దావోస్ సదస్సులో కీలక ఒప్పందం

Apollo Tyres: హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ (Digital Innovation Center) ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు దావోస్ (Davos Summit) వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, అపోలో సంస్థ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 17 Jan 2023, 3:49 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లో అపోలో టైర్స్ లిమిటెడ్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్
  • లండన్ తర్వాత హైదరాబాద్‌లో రెండో సెంటర్
  • ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu davos summit
దావోస్ సమ్మిట్
Apollo Tyres: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ (Digital Innovation Center) ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos Summit) వేదికగా జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అపోలో టైర్స్ లిమిటెడ్ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. లండన్ తర్వాత తమ రెండో డిజిటల్ ఇన్నేవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు అపోలో సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
నాలుగో ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌లో భాగంగా కంపెనీ డిజిటల్ వ్యూహాలైన ఐవోటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ మెషిన్ లెర్నింగ్ వంటి వినూత్న సాంకేతికతను ఉపయోగించుకొని కొత్త వ్యాపార నమునాలను అభివృద్ధి చేయనున్నట్లు అపోలో సంస్థ ప్రకటించింది. డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. అపోలో టైర్స్‌ భవిష్యత్ ప్రణాళికల సాధన కోసం డిజిటలైజేషన్ ఎంతో కీలకమని సంస్థ ఎండీ నీరజ్ కన్వర్ అన్నారు. లండన్‌ తరువాత హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ ఏర్పాటు చేయడం సంస్థ డిజిటల్ వ్యూహంలో భాగమని చెప్పారు.


రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టనున్న మరో కేంద్రం
బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ రూ.750 కోట్ల పెట్టబడితో తెలంగాణలో మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.

మొదట రూ. 210 కోట్ల పెట్టుబడితో మూడు గిగావాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు అలాక్స్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. భవిష్యత్తులో 10 గిగావాట్ల సామర్థ్యానికి పెంచి 2030 నాటికి మొత్తంగా రూ.750 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అలాక్స్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ కేంద్రం ద్వారా సుమారు 600 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనుండటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Nizam Mukarram Jah: ఒకప్పుడు ప్రపంచ కుబేరుడు.. కానీ ఇప్పుడు అద్దె ఇంట్లో చివరి శ్వాస !
Medak కారు దగ్ధం కేసులో ట్విస్ట్.. రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం సెక్రటేరియట్ ఉద్యోగి మాస్టర్ స్కెచ్ !
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.