యాప్నగరం

పెద్దపల్లిలో కాల్పుల కలకలం.. ఆర్మీ అధికారి అరెస్టు

Peddapalli: ఈ ఘటన కొద్ది రోజుల క్రితం జరగ్గా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇది పోలీసులను చేరడంతో కాల్పులకు పాల్పడిన తిరుమల్ రెడ్డిని అరెస్టు చేసి, పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు.

Samayam Telugu 14 Feb 2020, 1:32 pm
పెద్దపల్లి జిల్లా శాయంపేటలో తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. ఈ కాల్పులకు పాల్పడింది ఓ ఆర్మీ మాజీ అధికారి కావడం గమనార్హం. ధర్మారం మండలం శాయంపేటలో అర్ధరాత్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి బద్దం తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu Capture


Also Read: తెలంగాణ నేతలపై కేసుల చిట్టా.. కేసీఆర్‌, కేటీఆర్ కన్నా హరీశ్‌పైనే అత్యధికం

అయితే, ఈ ఘటన కొద్ది రోజుల క్రితం జరగ్గా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇది పోలీసులను చేరడంతో కాల్పులకు పాల్పడిన తిరుమల్ రెడ్డిని అరెస్టు చేసి, పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. ఒక పెళ్లి బారాత్‌లో వివాదం చెలరేగిన సందర్భంలో తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

ఆర్మీ అధికారి అయిన తిరుమల్ రెడ్డి ఇటీవలే రిటైర్ అయ్యాడు. ఇది లైసెన్స్‌డ్ గన్ అని చెప్పారు. చిన్న చిన్న వివాదాలకు కూడా ఆయన తుపాకీ చూపిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఆయన్ను శిక్షించాలని కోరుతున్నారు.

Also Read: వాలెంటైన్స్ డే: పార్కులు వెల వెల.. పోలీసుల బందోబస్తు

Also Read: షేక్‌హ్యాండ్ ఇచ్చి తెలంగాణ మంత్రి బంగారు కడియం చోరీ.. బతిమాలుకున్న పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.