యాప్నగరం

నగరమంతా అలా ఎందుకు చేయరు? హైదరాబాద్ పోలీసులపై ఒవైసీ నిప్పులు

Hyderabad Police: ‘‘చార్మినార్ వద్ద మాత్రమే ఎందుకు ఈ మార్చ్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఎందుకు ఈ మార్చ్ చేయలేదు. హైటెక్ సిటీ వద్ద ఎందుకు నిర్వహించలేదు.. లేదా అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీల ముందు ఎందుకు ఇలా చేయలేదు’’

Samayam Telugu 1 Mar 2020, 7:16 pm
హైదరాబాద్ పోలీసులపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి నిప్పులు చెరిగారు. నగరంలోని చార్మినార్ వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దళాలను జెండాతో మార్చ్ నిర్వహించడంపై ఆయన స్పందించారు. దీనికి సంబంధించిన ఫోటోను హైదరాబాద్ పోలీసులు ట్విటర్‌లో పోస్ట్ చేయగా, ఈ వ్యవహారాన్ని అసదుద్దీన్ తప్పుబట్టారు.
Samayam Telugu Asaduddin spe1.


ఆర్పీఎఫ్ దళంతో మార్చ్‌ను కేవలం చార్మినార్ వద్ద మాత్రమే ఎందుకు నిర్వహించారని, నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ‘‘చార్మినార్ వద్ద మాత్రమే ఎందుకు ఈ మార్చ్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఎందుకు ఈ మార్చ్ చేయలేదు. హైటెక్ సిటీ వద్ద ఎందుకు నిర్వహించలేదు.. లేదా అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీల ముందు ఎందుకు ఇలా చేయలేదు’’ అని ఒవైసీ ట్వీట్ చేశారు.

Must Read: ఐస్ క్రీం తిన్నారు.. వెంటనే నోట్లో నుంచి ధార కట్టిన రక్తం

Must Read: కలర్ ఫుల్‌గా మారుతున్న హైదరాబాద్.. కారణమదేనా..

అయితే, ఒవైసీ చేసిన ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈయన ట్వీట్‌కు భారీగా మద్దతిస్తోంటే.. మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘చార్మినార్ వద్ద ఎన్నిసార్లు కర్ఫ్యూ విధించారో చెప్పండి.. ఇదే సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు ఎన్ని సార్లు ఆంక్షలు విధించారు’ అని ఓ ట్విటర్ యూజర్ స్పందించారు. చార్మినార్ వద్ద సాయుధ దళాలైన ఆర్పీఎఫ్ సిబ్బందితో మార్చ్ చేయించడం కేంద్రం వ్యూహాత్మక చర్యల్లో భాగమని మరొకరు ట్వీట్ చేశారు.

Also Read: హైదరాబాద్ వాళ్లు అసూయ పడాల.. మంత్రి కేటీఆర్



Also Read: ‘రేవంత్ తప్పు చేశారు.. వారికి క్షమాపణలు చెప్పాలి’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.