యాప్నగరం

వరద బాధితులకు అసదుద్దీన్ ఓవైసీ భారీ సాయం

భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న మహారాష్ట్ర, కేరళలోని బాధితులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భారీ విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

Samayam Telugu 14 Aug 2019, 6:05 pm
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దాతృత్వాన్ని చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ, మహారాష్ట్రలోని బాధితులను తన వంతుగా ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఇరు రాష్ట్రాలకు బాధితుల సహాయార్థం మంగళవారం రూ. 20 లక్షలు విరాళం ఇచ్చారు. కేరళకు రూ. 10 లక్షలు, మహారాష్ట్రకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ డబ్బును ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పంపుతున్నట్లు ఓవైసీ తెలిపారు.
Samayam Telugu Owaisi


కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేరళ, మహారాష్ట్ర అతలాకుతలం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వరదలు పోటేత్తడంతో జన జీవనం స్తంభించిపోయింది. వందలాది గ్రామాలు నీట మునిగాయి. వరదల ధాటికి కేరళలో 91 మంది, మహారాష్ట్రలో 59 మంది మృత్యువాత పడ్డారు. ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

దీంతో ఆయా రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలీవుడ్ నటుడు రితేష్, జెనీలియా దంపతులు రూ. 25 లక్షలు సాయం ప్రకటించగా, టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు కర్ణాటక వరద బాధితులకు రూ. 2 లక్షలు అంద జేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.