యాప్నగరం

సీఎం కేసీఆర్ నిర్ణయానికి అసదుద్దీన్ ఒవైసీ మద్దతు

AIMIM: పాత భవనాలు కూల్చే క్రమంలో ప్రార్థనా మందిరాలు కూడా దెబ్బతింటున్నాయనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి కొంత మంది తీసుకెళ్లారు. దీనిపై సీఎం ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Samayam Telugu 10 Jul 2020, 4:16 pm
తెలంగాణలో పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న వేళ ఆ ప్రాంగణంలో ఉన్న ఓ ఆలయం, రెండు మసీదులను కూడా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. మసీదు, దేవాలయాలను ప్రభుత్వ ఖర్చులతో పునర్ నిర్మిస్తామంటూ ప్రకటన చేశారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ఈ ప్రకటనను ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్వాగతించారు. దీనికి సంబంధించి యునైటెడ్‌ ముస్లిం ఫోరం తరఫున పూర్తి ప్రకటన విడుదల చేస్తామని శుక్రవారం వరుసగా ట్వీట్లు చేశారు.
Samayam Telugu అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin


పాత భవనాలు కూల్చే క్రమంలో ప్రార్థనా మందిరాలు కూడా దెబ్బతింటున్నాయనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి కొంత మంది తీసుకెళ్లారు. దీనిపై సీఎం ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ పరిణామానికి చింతిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జరిగిన దానికి తాను ఎంతో చింతిస్తున్నానని అన్నారు. అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని, ఆ ప్రార్థనా మందిరాలైన దేవాలయం, మసీదులను అదే ప్రాంగణంలో విశాలంగా మళ్లీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆలయం, మసీదు నిర్వాహకులతో సమావేశమై కార్యాచరణ ఖరారు చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.