యాప్నగరం

పోలీస్ క్వార్టర్స్‌ భవనం పైనుంచి పడి ఏఎస్ఐ మృతి

మంచిర్యాలలో విషాదం చోటు చేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో భవనం పైనుంచి పడి ఏఎస్‌ఐ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Samayam Telugu 31 May 2020, 2:58 pm
మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీస్ క్వార్టర్ భవనం పైనుంచి పడి ఏఎస్ఐ మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు క్వార్టర్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఆదివారం (మే 31) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బోథ్ మండలం కరత్వాడ గ్రామానికి చెందిన ఎ. ఓదేలు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జన్నారంలోని పోలీస్ క్వార్టర్స్ తనకు కేటాయించిన గదికి వచ్చారు.
Samayam Telugu నమూనా చిత్రం
Mancherial Police death


ఏఎస్‌ఐ ఓదేలు ఆదివారం ఉదయం పోలీస్ క్వార్టర్ భవనం పైనుంచి కాలు జారి కిందపడ్డారు. ఈ క్రమంలో ఆయన గొంతుకు రేకు కోసుకుపోయింది. తీవ్ర రక్తస్రావమైంది. అది గుర్తించిన క్వార్టర్‌లోని ఇతర సిబ్బంది ఆయణ్ని హుటాహుటిన మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లుగా ద్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు.

ASI Death


Photo Credit: ntnews.com

Also Read: అది పాక్ విమానం కూలడానికి ముందు కాదు, బస్సు ప్రమాద దృశ్యాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.