Assam సీఎం మైక్ లాగిన ఘటన.. టీఆర్ఎస్ నేత, భగవంతరావుపై కేసు నమోదు
Bhagyanagar Ganesh Utsav Samithi: హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర వేళ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కార్యక్రమంలో మైక్ లాక్కున్న ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. టీఆర్ఎస్ నేత నంద కిశోర్ వ్యాస్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావుపై కూడా కేసు నమోదు చేశారు. మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
హైదరాబాద్ నగరంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) కార్యక్రమంలో మైక్ లాక్కున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గణేష్ శోభాయాత్రలో భాగంగా మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు వేదికపై చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్లో ఒక సీఎం స్థాయి వ్యక్తికి కల్పించిన భద్రతలో లోపాలను ఎత్తి చూపుతూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. మైక్ లాగేసిన టీఆర్ఎస్ నాయకుడు నంద కిశోర్ వ్యాస్తో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావుపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐపీసీ 341 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భాగ్యనగరంలో వినాయక శోభాయాత్రలో పాల్గొన్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా.. అకస్మాత్తుగా స్టేజీపైకి చేరుకున్న టీఆర్ఎస్ నేత నంద కిశోర్ వ్యాస్.. మైకు లాక్కున్నారు. బీజేపీ శ్రేణులు ఆయణ్ని అడ్డుకొని పక్కకు తీసుకొచ్చారు. కొంత మంది కార్యకర్తలు నందకిశోర్పై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకొని ఆయణ్ని అతికష్టం మీద వాహనం ఎక్కించి అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
వేదికపై ప్రసంగించిన వారు ముఖ్యమంత్రి కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ దూషించడాన్ని తట్టుకోలేక, సహనం కోల్పోయి మైక్ లాగేసుకున్నట్లు నందకిషోర్ ఆ తర్వాత చెప్పారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా.. భాగ్యనగర్ గణేశ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు పైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భాగ్యనగరంలో వినాయక శోభాయాత్రలో పాల్గొన్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా.. అకస్మాత్తుగా స్టేజీపైకి చేరుకున్న టీఆర్ఎస్ నేత నంద కిశోర్ వ్యాస్.. మైకు లాక్కున్నారు. బీజేపీ శ్రేణులు ఆయణ్ని అడ్డుకొని పక్కకు తీసుకొచ్చారు. కొంత మంది కార్యకర్తలు నందకిశోర్పై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకొని ఆయణ్ని అతికష్టం మీద వాహనం ఎక్కించి అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
వేదికపై ప్రసంగించిన వారు ముఖ్యమంత్రి కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ దూషించడాన్ని తట్టుకోలేక, సహనం కోల్పోయి మైక్ లాగేసుకున్నట్లు నందకిషోర్ ఆ తర్వాత చెప్పారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా.. భాగ్యనగర్ గణేశ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు పైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.