యాప్నగరం

ATM Robbery: వనస్థలిపురంలో మళ్లీ అదే ఏటీఎంలో భారీ చోరి

నాలుగేళ్ల కిందట చోరి జరిగిన ఏటీఎంలో మరోసారి దొంగతనం జరిగింది. ఐదుగురు సభ్యుల ముఠా గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మెషిన్ మొత్తం కట్ చేసి నగదు ఎత్తుకెళ్లారు.

Samayam Telugu 16 Nov 2020, 1:31 pm
వనస్థలిపురంలో ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని కొందరు దుండగులు ఏటీఎంను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి
Samayam Telugu వనస్థలిపురం ఏటీఎంలో చోరి
vanasthalipuram atm robbery

ఏటీఎం మిషన్ లో ఉన్న నగదు మొత్తం అపహరణ చేశారు. అయితే దుండగులు మిషన్ కట్టర్‌తో పూర్తిగా కట్ చేసి ఏటీఎం లో ఉన్న మొత్తం నగదు చోరీ చేశారు. చోరీ జరిగినట్లుగా గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ పోలీసులు వెంటనే నాలుగు టీమ్స్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read More: వీడియో: యువకుల్నిఎవరూ వినలేనన్ని బండ బూతులు తిట్టిన పోలీస్
పోలీసుల కథనం ప్రకారం. ఈ చోరీ ఘటనలో ఏటీఎంలో దొంగతనం చేసేదుకు మొత్తం ఐదు మంది ముఠా సభ్యులు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. దుండగుల్లో ఏటీఎంలోకి గ్యాస్ కటర్‌తో ఒక్కరూ మాత్రమే వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు ఏళ్ల క్రిందట ఇదే ఏటీఎంలో ఈ దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాజా చోరీ నేపథ్యంలో పాత నేరస్థులపైనే పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. 6 బృందాలుగా దుండగుల కోసం గాలిస్తున్నారు. ఏటీఎంలో అలారం లేకపోవడంతో రెండవ సారి కూడా దొంగతనం జరిగిందని పోలీసులు భావిసున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.