యాప్నగరం

Hyd: కిరాయి అడిగినందుకు కొడవలితో దాడి..

Hyderabad: అద్దె అడిగినందుకు ఓ వ్యక్తి యజమానిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యజమాని చేతి వేళ్లు తెగిపోయాయి. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Samayam Telugu 13 Jul 2020, 11:32 pm
ఇంటి అద్దె అడిగిన యజమానిపై కొడవలితో దాడి చేసిన వైనమిది. హైదరాబాద్‌ నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాల నిచ్చెల్ అలియాస్ కార్తీక్ (24) అనే వ్యక్తి తన భార్యతో కలిసి కొంత కాలంగా కుషాయిగూడలోని వి.ఎన్.రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Samayam Telugu అద్దె అడిగినందుకు యజమానిపై దాడి
Man Attacks House Owner in Hyderabad


కార్తీక్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత 8 నెలల నుంచి ఇంటి అద్దె చెల్లించడంలేదు. లాక్‌డౌన్‌తో పరిస్థితి మరింత దిగజారింది. ఇంటి యజమాని వజ్రమ్మ కుమారుడు సాయిలు గౌడ్ శనివారం (జులై 11) రాత్రి కార్తీక్‌ వద్దకు వచ్చి కిరాయి అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. కోపంతో కార్తీక్.. సాయిలు గౌడ్‌పై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో సాయిలు గౌడ్ చేతి వేళ్లు తెగిపోయాయి.

గాయపడిన సాయిలు గౌడ్‌ను అతడి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ కార్తీక్‌పై కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు కార్తీక్‌ను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. నిందితుడిని మల్కాజ్‌గిరి కోర్టులో హాజరు పరిచినట్లు కుషాయిగూడ ఎస్‌ఐ అనంతచారి తెలిపారు.

Also Read: ఏ తండ్రీ ఇలా చెప్పడు.. కదిలిస్తున్న లేఖ

Watch: బాబోయ్.. ఇంట్లో 23 పాములు బుస్ బుస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.