యాప్నగరం

TS: వరద నీటిలో కొట్టుకుపోయిన షేర్ ఆటో.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Mahabubnagar: నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా కోడేరు మండలం బావాయిపల్లి వాగులో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు కొట్టుపోయారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని కాపాడారు.

Samayam Telugu 26 Sep 2020, 7:34 pm
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని భూత్పూర్ మండలం పోతుల మడుగు నుంచి గోపన్నపల్లి వెళ్లే దారిలో రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న భారీ వర్షాలకు ఓ షేర్ ఆటో కొట్టుకుపోయింది. తొలుత వేగవంతమైన ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయిన ఆటోను తాడు కట్టి ట్రాక్టర్ ద్వారా లాగే ప్రయత్నం చేశారు. అయినా ఆ ప్రయత్నం ఫలించలేదు. తాడు తెగిపోయింది. దీంతో అదుపుతప్పిపోయిన ఆటో ఏకంగా కిలోమీటర్ దూరం కొట్టుకు పోయింది.
Samayam Telugu కొట్టుకుపోతున్న ఆటో
Auto washed away in floods in mahabubnagar due to heavy rains


ఆ షేర్ ఆటోలో ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో అంత దూరం కొట్టుకుపోయినా అందులో ఉన్న డ్రైవర్ ఈదుకుంటూ బయటకు వచ్చాడు. ఆటో డ్రైవర్ ఊశన్న సురక్షితంగా బయట పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి వాగులో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు కొట్టుపోయారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని కాపాడారు. భార్యాభర్తలు మేస్త్రీ పనులు చేసుకొనేందుకు పెద్ద కొత్తపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం కౌకుంట్ల వాగులో చేపల వేటకు వెళ్లి వెంకటేష్ వరద ఉదృతి పెరగటంతో వాగులో చిక్కుకున్నాడు. విషయం తెలిసిన గ్రామస్థులు అతన్ని కాపాడారు.ఉట్కూర్ మండలం పడిగిమారి వద్ద చీకటివాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో గొర్రెల కాపరి బాల్ రాజ్ గల్లంతయ్యాడు.అతన్ని స్ధానికులు రక్షించారు. మొత్తంగా భారీ వరదల సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైన అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.