యాప్నగరం

శంషాబాద్: కొచ్చీ విమానం రద్దు.. అయ్యప్ప భక్తుల ఆందోళన

Ayyappa Devotees: అయ్యప్ప భక్తులు కేరళలోని కొచ్చీ వెళ్లాల్సిన విమానం అర్ధంతరంగా రద్దవడంతో ఆందోళనకు దిగారు. గో ఎయిర్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 21 Dec 2019, 9:57 pm
కొచ్చీ వెళ్లాల్సిన ఓ విమానం అర్ధంతరంగా రద్దవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 180 మంది అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లడానికి హైదరాబాద్ నుంచి కొచ్చీ వెళ్లే గో ఎయిర్ సంస్థకు చెందిన విమానానికి గాను టికెట్లు బుక్ చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శనివారం (డిసెంబర్ 21) మధ్యాహ్నం బయల్దేరి వెళ్లాల్సిన విమానం చివరి నిమిషంలో రద్దైనట్లు గో ఎయిర్ విమానయాన సంస్థ ప్రకటించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారేమో అని భావించి అయ్యప్ప భక్తులు అక్కడే నిరీక్షించారు.
Samayam Telugu Representative Image


తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గో ఎయిర్ సంస్థ ఇబ్బందులకు గురి చేస్తోందని అయ్యప్ప భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదని.. ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబరిమలకు వెళ్లి భిక్ష చేయాల్సి ఉందని తెలిపారు.

ఎయిర్‌పోర్టులో బైఠాయించిన అయ్యప్ప భక్తులు.. గో ఎయిర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎయిర్‌లైన్స్ అధికారులకే సపోర్టు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Don't Miss: చాగంటి మానవ జాతికి దొరికిన మణిపూస: కేసీఆర్

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న గో ఎయిర్ విమానయాన సంస్థ.. అతి తక్కువ ధరలకే విమాన సేవలు అంటూ దేశంలోని పలు నగరాలకు ఫ్లైట్లను నడుపుతోంది. ప్రముఖ వ్యాపార రంగ సంస్థ వాడియా గ్రూప్ ఈ విమానయాన సంస్థను నిర్వహిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.