యాప్నగరం

దిగ్గజ నిర్మాత ట్వీట్‌పై కేటీఆర్ అదిరే ఆన్సర్.. వాళ్లని ఏకిపారేస్తున్న నెటిజన్లు

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ అన్ని ప్రధాన నగరాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రోజు కూలీ చేసుకుంటోన్న వలస కార్మికుల పరిస్థితి మరీ దీనంగా మారింది. చేతిలో పని లేక, ఇక్కడ పస్తులు ఉండలేక ఎంతో మంది వందలాది కిలోమీటర్లను సైతం లెక్క చేయకుండా తమ పిల్లా పాపలతో కాళ్లకు పని చెప్పాల్సి వస్తోంది. చంకలో పిల్లలు, నెత్తిన మూటలతో ఎర్రటి ఎండలో వారు గమ్య స్థానం వైపు వారు వేస్తు్న్న అడుగులు కంటతడి పెట్టిస్తోంది. ఇలాంటి వారి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి ఔదార్యం చూపిన సంగతి తెలిసిందే. వలస దారులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, వారు కూడా తెలంగాణ బిడ్డల్లాంటి వారేనని చేరదీశారు. ఒక్కొక్కరికీ నెలకు రూ.500 నగదు, 12 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని ఉదారంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై యావత్తు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.

Samayam Telugu 31 Mar 2020, 9:32 am
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ అన్ని ప్రధాన నగరాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రోజు కూలీ చేసుకుంటోన్న వలస కార్మికుల పరిస్థితి మరీ దీనంగా మారింది. చేతిలో పని లేక, ఇక్కడ పస్తులు ఉండలేక ఎంతో మంది వందలాది కిలోమీటర్లను సైతం లెక్క చేయకుండా తమ పిల్లా పాపలతో కాళ్లకు పని చెప్పాల్సి వస్తోంది. చంకలో పిల్లలు, నెత్తిన మూటలతో ఎర్రటి ఎండలో వారు గమ్య స్థానం వైపు వారు వేస్తు్న్న అడుగులు కంటతడి పెట్టిస్తోంది. ఇలాంటి వారి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి ఔదార్యం చూపిన సంగతి తెలిసిందే. వలస దారులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, వారు కూడా తెలంగాణ బిడ్డల్లాంటి వారేనని చేరదీశారు. ఒక్కొక్కరికీ నెలకు రూ.500 నగదు, 12 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని ఉదారంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై యావత్తు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.
Samayam Telugu bahubali producer shobu yarlagadda tweets on kcr issue ktr replies goes viral
దిగ్గజ నిర్మాత ట్వీట్‌పై కేటీఆర్ అదిరే ఆన్సర్.. వాళ్లని ఏకిపారేస్తున్న నెటిజన్లు


బాహుబలి నిర్మాత ట్వీట్

ఈ క్రమంలో దీనిపై బాహుబలి చిత్రాల నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ స్పందించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కరోనాపై పోరాటంలో బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత మంచి నిర్ణయం తీసుకుంటే, మరి జాతీయ న్యూస్ ఏజెన్సీ ఈ వార్తలను ఎందుకు కవర్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా దేశంలోనే అగ్ర న్యూస్ ఏజెన్సీ కేసీఆర్ ప్రకటించిన నిర్ణయం గురించి ఎందుకు ట్వీట్ చేయలేదని అన్నారు. అన్నీ వార్తలను ట్వీట్ చేసే సదరు ఏజెన్సీ వలస దారులపై కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌కు తెలంగాణ సీఎంవోను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ట్యాగ్ చేశారు.

స్పందించిన కేటీఆర్

తన పేరుతో ట్యాగ్ చేసే ట్వీట్లన్నింటికీ మంత్రి కేటీఆర్ చురుగ్గా స్పందించే సంగతి తెలిసిందే. నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్‌పైనా ఘాటుగా స్పందించారు. ‘‘ఏదైనా దిల్లీ (నేషనల్) మీడియా అయి ఉంటే ఎన్‌సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం) పరిధిని మించి చూడాలి!’’ అని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మాత శోభు యార్లగడ్డ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలంగాణలో కరోనాపై ఇంత మెరుగైన రీతిలో పోరాటం జరుగుతోంటే ఇక్కడి వార్తలు కవర్ చేయకపోవడం ఏంటని నెటిజన్లు జాతీయ మీడియాను ప్రశ్నిస్తున్నారు.

‘వైబ్రేషన్స్ మొదలయ్యాయి’

ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పాలనపై ఇప్పటకే వైబ్రేషన్స్ మొదలయ్యాయని, తర్వాతి పీఎం అభ్యర్థి కేసీఆరే అని గోపీక్రిష్ణ అనే నెటిజన్ కామెంట్ చేశారు. ఆ భయంతోనే మన వార్తలు కవర్ చేయడంలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడేది మొత్తం వారి భాషలో నేషనల్ మీడియాకు ఇస్తే వారు పిచ్చెక్కిపోతారని, ఇంత విషయం ఉన్న ముఖ్యమంత్రి మరెక్కడా లేరని అనుకుంటారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ వంటి పెద్ద దిక్కు ఉన్నందుకు హ్యాపీ అని ఆనందం వ్యక్తం చేశారు.

Must Read: మందు బాబుల్ని మామూలుగా మార్చేందుకు మంత్రి కీలక సూచనలు

Twitter-Gopi Krishna

‘పాక్ సమస్య పరిష్కారానికి ఎన్నో దారులు’

మరో ట్విటర్ యూజర్ సీఎం కేసీఆర్ గతంలో ఎన్డీటీవీతో మాట్లాడిన ఓ 13 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో కేసీఆర్ పాకిస్థాన్ వ్యవహారం గురించి మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వానికి పాకిస్థాన్ వ్యవహారం పరిష్కరించే సత్తా లేదని ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్‌తో అన్నారు. మరి పాక్ సమస్యను ఎలా పరిష్కరిస్తారని కేసీఆర్‌ను ప్రశ్నించగా.. అందుకు చాలా దారులు ఉన్నాయని కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. కేవలం దిల్లీ-ఎన్‌సీఆర్ మాత్రమే భారత్‌ కాదని, జాతీయ మీడియా అన్ని ప్రాంతాలను ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ వార్తలను ప్రసారం చేయాలని వినాయక్ రావు జువ్వాడి అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు.

Must Read: లాక్‌డౌన్: ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి భారీగా క్యూ.. మందు బాబుల అదుపు‌నకు పరిష్కారం ఏంటంటే..

Twitter-Gerrymandering Jagan anna

Twitter-Vinayak Rao Juvvadi

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.