యాప్నగరం

ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత

ఈ సంవత్సరం ధన్వంతరి నారాయణ గణపతిగా, చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో స్వామి కనిపిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా దర్శనం లేదని, దూరం నుంచి స్వామిని చూసి వెళ్లిపోవాలని నిర్వాహకులు చెబుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు.

Samayam Telugu 23 Aug 2020, 2:55 pm
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా పండగలు, పబ్బాలు కళతప్పాయి. ప్రతీ ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే గణేష్ నవరాత్రులపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. భాగ్యనగరానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్‌లో ఈసారి 9 అడుగుల గణనాథుడు కొలువుతీరాడు. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అయితే చరిత్రలో మొట్టమొదటి సారిగా గణపతి పండగపై కరోనా ఆంక్షలు విధించాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో భక్తులు కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా విఘ్నేశ్వరుణ్ని పూజించుకుంటున్నారు. ఈ క్రమంలో కరోనా ఆంక్షల నడుమ కొలువుదీరిన నగరంలోని ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Samayam Telugu ఖైరతాబాద్ గణేష్
khbd ganesh


కరోనా కారణంగా గణపతి మండపంలోకి భక్తులను అనుమతించొద్దని పోలీసుల ఆదేశించిన విషయం తెలిసిందే. గణనాథుడి దర్శనం కోసం వస్తోన్న భక్తులను ఎవరనీ కమిటీ సభ్యులు మండపంలోకి అనుమతించడంలేదు. కరోన కారణంగా సాధారణ భక్తులకు అనుమతి లేదన్నారు. రోడ్డుమీద నుంచి మాత్రమే దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఇందులో భాగంగానే బయటి నుంచే తాళ్లు కట్టి వెలుపలే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
Read More: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 16 గేట్లు ఎత్తివేత
దీంతో కమిటీ సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనకు దిగారు. గణపతి విగ్రహానికి అడ్డంగా పరదా కట్టొద్దని నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేవలం కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకోవాలని భక్తులను కోరుతున్నట్టు కమిటీ సభ్యులు స్పష్టంచేశారు.

మరోవైపు ప్రజలు కూడా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. తొలిరోజునే పెద్దఎత్తున ప్రజలు స్వామి దర్శనానికి వచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించాలన్న ఆలోచన లేకుండా, సెల్ఫీలకు ఎగబడ్డారు. పలువురు కనీసం మాస్క్ లు కూడా ధరించక పోవడం గమనార్హం. వీరిని నియంత్రించలేక ఉత్సవ కమిటీ ఇబ్బందులు పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.