బలగం సినిమాలో క్లైమాక్స్ పాటతో కోట్లాది మంది హృదయాలను ద్రవింపజేసిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య.. వరంగల్లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. మొగిలయ్యకు వైద్యులు డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. బీపీ, షుగర్తో బాధపడుతున్న మొగిలయ్యకు.. రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. దీంతో వరంగల్లో డయాలసిస్ చేయిస్తున్నారు. అయితే.. డయాలసిస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. మొగిలయ్య ఆరోగ్యంపై మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. బలగం సినిమా క్లైమాక్స్లో.. మరుగునపడిపోయిన మానవ సంబంధాల విలువను తెలియజేస్తూ.. మొగిలయ్య దంపతులు పాట ఆలపించారు. తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొమురయ్యా అంటూ సాగే ఆ పాట ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. గుండెలోతుల్లోని తడిని తట్టిలేపి.. కళ్ల నుంచి ధారగా వర్షించేలా ఆర్దతతో పాడారు సింగర్ మొగిలయ్య, కొమురమ్మ దంపతులు.
పాట చూసిన ప్రతి ఒక్కరితో కన్నీరు తెప్పించేలా పాడిన ఆ మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆయనకు కావాల్సిన పూర్తి వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆయనకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.
పాట చూసిన ప్రతి ఒక్కరితో కన్నీరు తెప్పించేలా పాడిన ఆ మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆయనకు కావాల్సిన పూర్తి వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆయనకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.
- Read More Telangana News And Telugu News