యాప్నగరం

మన ధర్మం ముఖ్యం.. మహాంకాళీ ఆలయంలో బండి సంజయ్ పూజలు

కులాలు, వర్గాల పేరుతో ప్రజలు చీలిపోకూడదన్నారు. కులం ముఖ్యమే కాని దాని కన్నా ధర్మం ఇంకా చాలా ముఖ్యమన్నారు. సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Samayam Telugu 30 Nov 2020, 10:57 am
బండి సంజయ్ సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం బండి సంజయ్ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాబ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. బల్దియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం జోరుగా నిర్వహించారు.
Samayam Telugu బండి సంజయ్


అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సమాజం హేళనకు, నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. కులాలు, వర్గాల పేరుతో ప్రజలు చీలిపోకూడదన్నారు. కులం ముఖ్యమే అన్న బండి సంజయ్ కులంతో పాటు ధర్మం, సమాజం కూడా ముఖ్యమన్నారు. నేను హిందువని సగర్వంగా తలెత్తుకొని రోజు రావాలని అమ్మవారికి ప్రార్థించానన్నారు. ఇబ్బందులన్ని తొలగి కష్టాల నుంచి బయటకు రావాలని అమ్మవారికి ప్రార్థనలు చేశానన్నారు. హిందూ సమాజం శక్తివంతంగా తయారు కావాలని కోరానని తెలిపారు. సమాజం క్షేమం కోరినవారికే మాత్రమే అమ్మవారి కరుణ ఉంటుందన్నారు బండి సంజయ్.

Read More:
ఆ అవకాశం నాకు ఇవ్వొద్దు.. డీజీపీకి వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. భారతీయులకు జీవించే అదృష్టం మనకు వచ్చిందన్నారు. ఇతర దేశాల ప్రజలు కూడా పునర్జన్మ ఉంటే భారతదేశంలో చీమగానో దోమగానో పుట్టాలని కోరుకుంటున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.