యాప్నగరం

సింగరేణి ఉద్యోగి మీవల్లే చనిపోయాడు.. బండి సంజయ్ మండిపాటు

Singareni: ఏప్రిల్ 7న ఉదయం విధులకు హాజరై ఆ త‌ర్వాత‌ క‌నిపించ‌కుండా పోయాడు. సరిగ్గా పది రోజులకు ఏప్రిల్ 17న అతను చనిపోయి ఉన్నాడు. కుళ్లిపోయిన స్థితిలో అతని దేహాన్ని సిబ్బంది గుర్తించారు.

Samayam Telugu 18 Apr 2020, 9:37 pm
అధికారుల నిర్లక్ష్యానికి ఓ సింగ‌రేణి కార్మికుడు బలైపోయాడ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సింగరేణిలో అత‌ని మృతిపై కేంద్రమంత్రికి, మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేస్తాన‌ని అన్నారు. ప‌ది రోజుల క్రితం గ‌నుల్లోనే కనిపించకుండా పోయి చనిపోయి ఉన్న కోడెం సంజీవ్ పార్థివదేహానికి శనివారం ఆయన నివాళులు అర్పించారు. అత‌ని కుటుంబ సభ్యులను ఓదార్చారు. లాక్‌ డౌన్‌ ఉన్న సమయంలోనూ అధికారులు ఒత్తిడి చేసి ఆయనను విధుల్లోకి పిలిచారని ఆరోపించారు.
Samayam Telugu Bandi Sanjay


Also Read: undefined

రామగుండం ఆర్‌జీ-1 ఏరియా జీడీకే 11 గనిలో జనరల్‌ మజ్దూర్‌‌గా విధులు నిర్వహిస్తున్న కోడెం సంజీవ్‌ (55) అనే వ్యక్తి ఏప్రిల్ 7న ఉదయం విధులకు హాజరై ఆ త‌ర్వాత‌ క‌నిపించ‌కుండా పోయాడు. సరిగ్గా పది రోజులకు ఏప్రిల్ 17న అతను చనిపోయి ఉన్నాడు. కుళ్లిపోయిన స్థితిలో అతని దేహాన్ని సిబ్బంది గుర్తించారు. విధుల అనంతరం బయటకు రావాల్సి ఉంది. ఈక్రమంలో దారి తప్పి మూసివేసిన జీడీకే–6ఏ గని వైపు సీమ్‌లోకి గాలి లేని ప్రాంతంలోకి వెళ్లి ఊపిరాడక మృతిచెందాడని అధికారులు గుర్తించారు.

Also Read: undefined

లాక్ డౌన్ ఉన్న సమయంలోనూ అధికారులు కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవ‌డం వల్లే ఈ దుర్ఘటన జ‌రిగింద‌ని బండి సంజయ్ ఆరోపించారు. మైనింగ్ నిబంధనల ప్రకారం.. శిక్షణ ఉన్న కార్మికులనే విధుల్లోకి తీసుకోవాలని గుర్తు చేశారు. కానీ, అనుభవం లేని కోడెం సంజీవ్‌ను ఒత్తిడి చేసి మరీ అధికారులు విధుల్లోకి పిలిచార‌ని ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత అధికారులదేన‌ని అన్నారు. తక్షణమే సంజీవ్ కుటుంబాన్ని ఆదుకొని అత‌ని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎంపీ సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.