యాప్నగరం

ప్రధాని మోదీ చేత కేసీఆర్‌కు భారీ గజమాల వేయిస్తాం.. బండి సంజయ్

రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో.. తెలంగాణలో ఏం జరగనుందని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ సభకు ఈసారైనా సీఎం కేసీఆర్ వెళ్తారా లేదా అన్నది ఇప్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే... ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్ రావాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఒకవేళ సభకు వస్తే కేసీఆర్‌కు ప్రధాని చేత సన్మానం చేయిస్తామని.. ఆయన చేతులతోనే భారీ గజమాల వేయిస్తామని బండి సంజయ్ తెలిపారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 7 Apr 2023, 7:39 pm

ప్రధానాంశాలు:

  • మోదీ సభకు కేసీఆర్ రావాల్సిందిగా బండి సంజయ్ పిలుపు
  • వస్తే మోదీ చేత సన్మానం చేపిస్తామన్న బండి సంజయ్
  • మోదీ చేతుల మీదుగా భారీ గజమాల వేయిస్తామని వ్యాఖ్య

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu modi kcr
మోదీ కేసీఆర్
రేపు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు సర్వాత్రా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఒకవేళ రాకపోతే.. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావ్ అని హెచ్చరించారు. అయితే.. ప్రధాని సభకు కేసీఆర్ వస్తే ప్రధానితో సన్మానం చేయిస్తామన్నారు. మోదీ చేతులతోనే కేసీఆర్‌కు భారీ గజమాల వేయిస్తామంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వస్తోన్న ప్రధాని మోదీని.. అధికార పార్టీనే అడ్డుకోవడం సిగ్గుచేటని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన అధికార పార్టీనే.. ఇలా ధర్నాలకు పిలుపునివ్వడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పర్యటనలో చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా.. కేసీఆర్‌ కుటుంబమే బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తోంది కేంద్రం కాదని.. తెలంగాణనే అని వ్యాఖ్యానించారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయమని రామగుండం సభలో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.

రేపు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలా ఉంటే.. అదే రోజును రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. సింగేరేణి గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. రేపు ఏం జరగబోతోందన్నది ఉత్కంఠగా మారింది.

అల్లుడు లేడని పిట్ట ముట్టలేదు.. బండి సంజయ్ ఇంట్లో 'బలగం' సీన్ రిపీట్..!
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.