రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో జరిగిన పేలుడు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ భద్రత అధికారులు తక్షణమే ఈ పేలుడు ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. మృతి చెందిన కార్మికులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సింగరేణి ప్రమాద విషయంలో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మృతి చెందిన కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలేయడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణిలో అధికారులకు ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారని ఆరోపించారు. సింగరేణి అధికారులు కాంట్రాక్టులు కేటాయించి పనులపై పర్యవేక్షణ చేయడం లేదని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామీలతో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.
సింగరేణిలో కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలేయడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణిలో అధికారులకు ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారని ఆరోపించారు. సింగరేణి అధికారులు కాంట్రాక్టులు కేటాయించి పనులపై పర్యవేక్షణ చేయడం లేదని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామీలతో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.