యాప్నగరం

‘నీ అయ్య జాగీరా భాయ్, దారుస్సలాంను కూల్చిపారేస్తాం’: బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Darussalam: ‘‘నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా.. భాయ్. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండు గంటలల్లోనే నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు’’ అని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 25 Nov 2020, 6:45 pm
పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలన్న అక్బర్ వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. ‘‘హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా.. భాయ్. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండు గంటలల్లోనే నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరంలోని అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu అక్బరుద్దీన్ ఒవైసీ, బండి సంజయ్
Bandi sanjay


మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు చేవచచ్చి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని, ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. హిందువులు అందరూ ఓటు బ్యాంకుగా మారితేనే హైదరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని అన్నారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలివీ..
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ 4,700 ఎకరాల ఉంటే ఈ రోజు 700 ఎకరాలు కూడా లేదని అన్నారు. అంత స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించారని ఆరోపించారు. అక్రమకట్టడాలలో భాగంగా హుస్సేన్‍సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read: GHMC Elections: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.