యాప్నగరం

Bandi Sanjay:'బీజేపీలో కోవర్టులు లేరు.. అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా'

Bandi Sanjay Kumar: ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఒకే తాము కూడా ముందస్తుకు సిద్ధమని అన్నారు. బీజేపీలో కోవర్టులు లేరని.. ఈటల వ్యాఖ్యలను వక్రీకరించాని సంజయ్ అన్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 29 Jan 2023, 1:52 pm

ప్రధానాంశాలు:

  • కేసీఆర్ ఓకే అంటే ముందస్తుకు మేం రెడీ
  • బీజేపీలో కోవర్టులు లేరు
  • బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bandi sanjay kumar
బండి సంజయ్ కుమార్
Bandi Sanjay Kumar: కోవర్టులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో కోవర్టులు ఉండరని వ్యాఖ్యనించారు. బీజేపీలో కోవర్టులున్నారని తమ పార్టీ నాయకుడు ఈటల అనలేదని అన్నారు. కొన్ని మీడియా ఛానళ్లు ఈటల వ్యాఖ్యలను వక్రీకరించాయని చెప్పారు. ముందస్తు ఎన్నికలపై నిన్న మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమని, కేటీఆర్.. ఆ మాటను తన తండ్రి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చెప్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని సంజయ్ మండిపడ్డారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను బీఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకునేందుకు నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్‌లు చెబుతున్న అబద్ధాలను విని ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటురాని వంద గ్రామాల పేర్లు చెప్తానని, వచ్చే ఐదు గ్రామాల పేర్లు చెప్పాలన్నారు. నిజంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పకుంటాని సవాల్ విసిరారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, రైతు బీమా కేసుల్లో 10 వేల మంది అన్నదాతలవి ఆత్మహత్యలేనని తేలాయని అన్నారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్.. ఇప్పుడు రైతులను ఎమ్మెల్యేలను చేస్తామంటే ప్రజలు నమ్మరని అన్నారు. అధికారంలోకి రావటం కోసం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపటం ఖాయమని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని సంజయ్ జోశ్యం చెప్పారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.