యాప్నగరం

సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Telangana BJP: ఆదివారం హైదరాబాద్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కరోనా చికిత్సకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రుల విషయంలో ప్రభుత్వం హడావుడి చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు.

Samayam Telugu 30 Aug 2020, 2:44 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిలో కూరుకుపోయారని, ఆయన జైలుకు వెళ్ళటం ఖాయమని వ్యాఖ్యానించారు. కరోనా చికిత్సల విషయంలో ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులతో కలిసిపోయిందని బండి సంజయ్ ఆరోపించారు.
Samayam Telugu కేసీఆర్, బండి సంజయ్ (ఫైల్ ఫోటోలు)
bandi on kcr

ఆదివారం హైదరాబాద్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కరోనా చికిత్సకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రుల విషయంలో ప్రభుత్వం హడావుడి చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. రెండు ఆస్పత్రులను మూసేసి ప్రభుత్వం నిమ్మకుండిపోయిందన్నారు.

‘‘గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కరోనా పెరిగిందని చెప్పాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రంజాన్ సమయంలో కరోనా కేసులను తగ్గించి చూపారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది. ఎన్నికల సమయంలో పీఆర్సీపై ఇచ్చిన హామీని అమలు చేయాలి. సింగరేణి ఎన్నికల సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.