Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. తమతో పలుమార్లు సంప్రదింపులు జరిపారని, సీఎం కేసీఆర్కు ఈ విషయం తెలిసి మూర్చపోయినట్లున్నారని తెలిపారు. గతంలో పలుమార్లు మంత్రులతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కూడా పలుమార్లు అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి ఆ వ్యాఖ్యలను రిపీట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ టీం సభ్యులతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. చాలామంది ఎమ్మెల్యేలు తనతో ఫోన్లో మాట్లాడతారని, అందుకే పోలీసులను పంపించి తన ఫోన్ను కేసీఆర్ తీసుకున్నారని బండి ఆరోపించారు. తన ఫోన్ ప్రస్తుతం కేసీఆర్ దగ్గరే ఉందని, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారనేది వినడమే ఆయనకు పని అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కోసం పోలీసులే తన ఫోన్ను మాయం చేశారని బండి పేర్కొన్నారు. తన ఫోన్ బయటకు వస్తే సంచలన విషయాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారని అన్నారు.
కరీంనగర్లోని తన ఇంట్లో తనను అరెస్ట్ చేసి సిద్దిపేటకు తీసుకెళ్లారని, సిద్దిపేట వరకు తన ఫోన్ ఉందన్నారు. ఆ తర్వాత తన ఫోన్ మిస్ అయిందని, ఇది పోలీసుల పనేనంటూ బండి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మెప్పు కోసం, ప్రమోషన్ల కోసం కొంతమంది పోలీస్ అధికారులు ఎంతకైనా దిగజారడానికి సిద్దంగా ఉన్నారని ఆరోపించారు. నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, లీగల్ సెల్ పటిష్టంగా ఉండాలని సూచించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాయాలని బండి సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించడం లేదని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్న కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉండాలని కోరారు. కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల టైమ్లో కార్యకర్తలపై మరిన్ని కేసులు పెడతారని, అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు.
కరీంనగర్లోని తన ఇంట్లో తనను అరెస్ట్ చేసి సిద్దిపేటకు తీసుకెళ్లారని, సిద్దిపేట వరకు తన ఫోన్ ఉందన్నారు. ఆ తర్వాత తన ఫోన్ మిస్ అయిందని, ఇది పోలీసుల పనేనంటూ బండి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మెప్పు కోసం, ప్రమోషన్ల కోసం కొంతమంది పోలీస్ అధికారులు ఎంతకైనా దిగజారడానికి సిద్దంగా ఉన్నారని ఆరోపించారు. నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, లీగల్ సెల్ పటిష్టంగా ఉండాలని సూచించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాయాలని బండి సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించడం లేదని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్న కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉండాలని కోరారు. కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల టైమ్లో కార్యకర్తలపై మరిన్ని కేసులు పెడతారని, అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు.
- Read More Telangana News And Telugu News