యాప్నగరం

పాస్‌పోర్టుల బ్రోకర్ ఆయన.. బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Dubbaka By Election: ముఖ్యమంత్రి తాత వచ్చినా దుబ్బాకలో బీజేపీ విజయాన్ని ఆపలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రఘునందన్ గెలిచాక అసెంబ్లీలో మొదటి చర్చ పెన్షన్ల మీదే ఉంటుందని బండి సంజయ్ అన్నారు.

Samayam Telugu 29 Oct 2020, 7:34 pm
సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాస్‌పోర్ట్‌ల బ్రోకర్‌ కేసీఆర్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను ముంచి రూ.కోట్లు సంపాదించారని, కులాలను అడ్డుపెట్టుకొని మంత్రి పదవి పొందినవారని విమర్శించారు. వారిని నట్టేట ముంచి కేసీఆర్ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. సీఎంను ఎన్నుకున్నందుకు.. దేశమే ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రజలు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మోతెలో బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత దౌల్తాబాద్‌లో జరిగిన గొర్రె కాపరుల సమ్మేళనంలోనూ పాల్గొని ప్రసంగించారు.
Samayam Telugu కేసీఆర్, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
kcr on bandi


ముఖ్యమంత్రి తాత వచ్చినా దుబ్బాకలో బీజేపీ విజయాన్ని ఆపలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. రఘునందన్ గెలిచాక అసెంబ్లీలో మొదటి చర్చ పెన్షన్ల మీదే ఉంటుందని బండి సంజయ్ అన్నారు. బీసీలను తెలంగాణ సీఎం నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ఇళ్లు నీటమునిగితే.. కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని మండిపడ్డారు. కేంద్రానికి వ్యవసాయ పంపుసెట్ల వద్ద మీటర్లు పెట్టే యోచనలేదని స్పష్టం చేశారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.