యాప్నగరం

అక్కడ ఎవరైనా వేలెత్తితే వాళ్ల చెయ్యి నరికేస్తాం.. బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Telangana BJP: హైదరాబాద్‌ అల్వాల్‌ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Samayam Telugu 8 Sep 2020, 2:52 pm
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ మంగళవారం ఓ ట్వీట్ చేసింది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో బీజేపీ మద్దతుదారులు, హిందువులు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాపాడుకుంటుందని చెప్పారు. ఎవరైనా వారిపై వేలెత్తి చూపించాలని ప్రయత్నిస్తే.. వారి చేయి నరికేస్తామని బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu బండి సంజయ్
Bandi Sanjay


హైదరాబాద్‌ అల్వాల్‌ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వేళ ప్రజా సమస్యలు పరిష్కరించే అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ పునరుద్ఘాటించారు.

తెలంగాణ ప్రజలకు బీజేపీతోనే మంచి జరుగుతుందని బండి సంజయ్ మరోసారి వ్యాఖ్యానించారు. అనవసర కేసులు పెట్టి బీజేపీ నేతలను అధికార పార్టీ వేధింపులకు గురి చేయాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులెవరూ అధికార పార్టీ మోపే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కింది స్థాయిలోని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సైతం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.