యాప్నగరం

అపోలో ఆస్పత్రిలో చేరిన ఈటల.. పరామర్శించిన బండి సంజయ్

బండి సంజయ్‌తో పాటు వివేక్ కూడా ఈటలను పరామర్శించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. ఈటల జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.

Samayam Telugu 31 Jul 2021, 11:54 am
ఈటెల రాజేందర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం రోజున పాదయాత్రలో భాగంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ముందుగా నిమ్స్ ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం మెరుగ్గా ఉందన్నారు డాక్టర్లు.
Samayam Telugu ఈటలకు బండి సంజయ్ పరామర్శ


అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఈటెల రాజేందర్‌ను బీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. పాదయాత్ర నిలిపివేయాలని ఈటెలను కోరామన్నారు. అయితే ఈటల మాత్రం పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. ఈటల కష్టపడి పాదయాత్ర చేస్తుంటే..ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి అక్రమ పద్ధతిలో గెలిచేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బండి సంజయ్ వెంట జి.వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు. ఈటలకు జ్వరంతో పాటు కాళ్లు మొత్తం బొబ్బలు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.