యాప్నగరం

సీఎం ఇలాకాలోనే అలా ఉంటే బయట ఎన్ని ఘోరాలో: బండి సంజయ్

Kondapochamma: నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వారిపై వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 30 Jun 2020, 3:58 pm
తెలంగాణలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. నాణ్యత లేని నీటి ప్రాజెక్టులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మధ్య మానేరు, మల్లన్న సాగర్, ఇప్పుడు కొండపోచమ్మకు గండి పడిందని, ఇలా నాణ్యత లేని నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల ప్రజలు క్షణక్షణం బిక్కుబిక్కుమనాల్సిందేనని వ్యాఖ్యానించారు. సీఎం సొంత నిజయోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల ఇంకా ఎన్ని దారుణాలు, ఘోరాలు జరుగుతాయో అని అనుమానం వ్యక్తం చేశారు.
Samayam Telugu కేసీఆర్, బండి సంజయ్
bandi sanjay kcr


స్కాముల కోసమే స్కీములు పెట్టారనేందుకు కొండపోచమ్మ కాలువకు పడిన గండీనే నిదర్శనమని ఆరోపించారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని అన్నారు. కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈ లీకేజీలకు మూల కారణని ఆరోపించారు. నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వారిపై వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. గుత్తేదారు నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసి కాల్వకు తక్షణం మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇలా నాణ్యత లేని నిర్మాణాలు చేపడుతుంటే విజిలెన్స్ డిపార్ట్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.