యాప్నగరం

బీజేపీలోకి విజయశాంతి ఖాయమేనా? బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Telangana BJP: విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని బండి సంజయ్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.

Samayam Telugu 3 Nov 2020, 3:42 pm
విజయశాంతి బీజేపీలో చేరతారని కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న విజయశాంతి పార్టీ మారబోరని ఆ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దీంతో ఆమె పార్టీ మారే అంశంపై కాస్త స్పష్టత వచ్చినా, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆమె పార్టీ మారతారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా విలేకరులు విజయశాంతి అంశాన్ని లేవనెత్తారు. దీనిపై బండి సంజయ్ స్పందించారు.
Samayam Telugu విజయశాంతి, బండి సంజయ్ (ఫైల్ ఫోటోలు)
Vijayashanti, bandi sanjay


Also Read: undefined

ఆయన రాములమ్మను పొగడ్తలతో ముంచెత్తారు. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని, రాష్ట్ర వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని బండి సంజయ్‌ అన్నారు. అంతేకాక, ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంట్లో పడుకుంటే.. విజయశాంతి పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాటం చేశారని అన్నారు.

రాములమ్మ బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. సాధారణంగా తరచూ టీఆర్ఎస్ లీడర్లతోపాటు కాంగ్రెస్ నాయకులపై కూడా విరుచుకుపడుతుండే బండి సంజయ్ విజయశాంతిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.