యాప్నగరం

కేసీఆర్ పల్లకి మోస్తానంటూ.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన బండి సంజయ్

హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకున్న చర్యల వల్లే కరోనాకు అడ్డుకట్ట వేయగలిగామన్నారు.

Samayam Telugu 17 Jan 2021, 1:28 pm
కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆ్ పల్లకీ మోస్తానంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే దీనికి సీఎం ఓ పనిచేయాలంటూ కండిషన్స్ పెట్టారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేస్తే.. ఆయన పల్లకి మోస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన .. కేసీఆర్‌పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు.
Samayam Telugu బండి సంజయ్


ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మూడు లక్షల ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనాను సమర్థవంతంగా అడ్డుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం కరోనా మహమ్మారిని చులకనగా మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్‌ను సరైన సమయంలో అమలు చేయకపోవటం వలన పేదలు ప్రాణాలు కోల్పోయారు.

Read More: ఎమ్మెల్యే పొలాల కోసం కాలువ నిర్మాణం.. అసలు విషయం అది కాదంటున్న అధికారులు

కబ్జాదారులను కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రామమందిర నిర్మాణంపై వారి అభిప్రాయం చెప్పాలి. కేంద్రం నిధులతోనే డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు బండి సంజయ్. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూస్ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.