యాప్నగరం

పాతబస్తీలో కుట్ర జరుగుతోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

పాతబస్తీలో హిందువులపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి ఆస్తుల్ని ఎవరు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. భాగ్యనగర్‌లో పోలీసుల్ని గెలిపిస్తే.. 24 గంటల్లోపే పోలీసులకు పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామన్నారు.

Samayam Telugu 29 Nov 2020, 11:45 am
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులపై కేసులు సైతం నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా పాతబస్తీపై మరోసారి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారన్నారు. పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ కోరుకుంటోందని స్పష్టం చేశారు.
Samayam Telugu బండి సంజయ్
bandi sanjay


బేగంపేటలో వైద్యులతో బండి సంజయ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాతబస్తీలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శాలిబండ అలియాబాద్ ఉప్పుగూడ లాల్ దర్వాజ గౌలిపుర చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడ పోయారు? అని ప్రశ్నించారు. వాళ్ళ ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారు? ఎవరు కబ్జా చేశారు? అని నిలదీశారు. పోలీసులు హీరోలు అన్నారు. భాగ్యనగర్‌లో పోలీసుల్ని గెలిపిస్తే.. 24 గంటల్లోపే పోలీసులకు పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామన్నారు. పాకిస్థాన్ కుక్కలను బాంగ్లాదేశ్ ఆఫ్ఘానిస్తాన్ రోహింగ్యా లుచ్చలను బయటకు గుంజి వాళ్ళను తరిమేస్తామన్నారు.

Read More: వేడెక్కిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. ఇవాల్టితో ముగింపు

భాగ్యనగరానికి బీజేపీయే రక్షణ కవచమన్నారు బండి సంజయ్. పాతబస్తీలో ఏడాదికి రూ.600 కోట్లు విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఆస్తి పన్ను చెల్లించడం లేదు, నల్లా బిల్లులు చెల్లించడం లేదు. పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీలో జల్సా చేస్తారా?'' అని ప్రశ్నించారు. గ్రేటర్‌లో బీజేపీకు అవకాశం ఇవ్వాలని వైద్యులను కోరారు. ఎన్నో మహానగరాలను భాజపా అభివృద్ధి చేసిందని, హైదరాబాద్‌ను కూడా మహానగరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.