యాప్నగరం

మీరైనా కేసీఆర్‌ను ఆదేశించండి.. గవర్నర్‌కు లేఖ రాసిన బండి సంజయ్

Telangana Governor: వైద్య వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ లేఖలో ఫిర్యాదు చేశారు. దానివల్లే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.

Samayam Telugu 16 May 2021, 9:52 pm

ప్రధానాంశాలు:

  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎంను ఆదేశించండి
  • ఆయుష్మాన్ భారత్ అమలుపైన కూడా..
  • గవర్నర్ తమిళిసైకి బండి సంజయ్ లేఖ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
bandi sanjay
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బండి సంజయ్ తమిళసైని కోరారు. కరోనాను నియంత్రించటంలో, వైద్య వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేఖలో ఫిర్యాదు చేశారు. దానివల్లే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా గవర్నర్‌కు బండి సంజయ్ లేఖ పంపారు.
అంతేకాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, ప్రైవేటులో చికిత్స కోసం పేదలు ఆస్తులను అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్‌లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లే.. ‘ఆరోగ్య శ్రీ’ ద్వారా కూడా కరోనా చికిత్స ఫ్రీగా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

‘‘బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించాలి. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి దాదాపు ఏడాదవుతున్నా ఇంతవరకు అమలు చేయడం లేదు. 30 డిసెంబర్ 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్సులో పాల్గొన్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి.’’ అని బండి సంజయ్ గవర్నర్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.