యాప్నగరం

ఉత్తమ్ అరుదైన రికార్డ్.. కంగ్రాట్స్ చెప్పిన బండ్ల

TPCC Chief | పీసీసీ చీఫ్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న‌ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మాజీ నేత బండ్ల గణేశ్ కంగ్రాట్స్ చెప్పారు.

Samayam Telugu 1 May 2020, 3:42 pm
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకే టర్మ్‌లో ఐదేళ్లు పీసీసీ చీఫ్‌గా ఉండటం ద్వారా... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన నాయకుడిగా ఉత్తమ్ ఘనత వహించారు. పొన్నాల లక్ష్మయ్య స్థానంలో 2015లో టీపీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టిన ఉత్తమ్.. కాంగ్రెస్ నాయకులను కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నించారు.
Samayam Telugu ఉత్తమ్


2018 చివర్లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. లోక్‌ సభ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. హుజూర్ నగర్ స్థానం నుంచి ఆయన భార్య పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధపడ్డారు.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు సహా బోలెడంత మంది ఆశావాహులు పీసీసీ రేసులో ఉన్నారు. కానీ గ్రూప్ రాజకీయాల కారణంగా.. నూతన పీసీసీ చీఫ్‌ను ఎన్నుకోవడం అధిష్టానానికి తలకు మించిన భారంగా మారింది.

బండ్ల గణేష్ విషయానికి వస్తే.. తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. పార్టీ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా కూటమి ఓడిపోతే గొంతుకోసుకొని చనిపోతానంటూ బండ్ల చేసిన ప్రకటన అప్పట్లో సంచలనమైంది. కాంగ్రెస్ ఓటమి తర్వాత.. 2019 ఏప్రిల్ 5న బండ్ల గణేశ్ రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.