యాప్నగరం

భద్రాద్రి రామాలయ పూజారికి కరోనా పాజిటివ్

భద్రాచలం జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా రామాలయ పూజారి కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Samayam Telugu 8 Aug 2020, 3:01 pm
భద్రాద్రి జిల్లాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా రామయ్య సన్నిధిలో పని చేస్తున్న ఒక అర్చకుడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆలయంలో పని చేస్తున్న వారిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండుకు చేరింది. ఇది వరకు ఆలయ ఉద్యోగి ఒకరికి వైరస్ సోకింది. ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతుండటంతో.. ఆలయంలో పని చేస్తున్న వారందరికీ టెస్టులు చేయాలని రామాలయ సిబ్బంది కోరుతున్నారు.
Samayam Telugu ramalayam


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తీవ్రమైంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం భద్రాది జిల్లాలో కొత్తగా 79 కరోనా కేసులను గుర్తించారు. గత వారం రోజుల్లోనే జిల్లాలో 335 కేసులు నమోదయ్యాయి.

కరోనా బారిన పడి జిల్లాకు చెందిన యువ వైద్యాధికారి ప్రాణాలు కోల్పోయారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జి. నరేశ్ కుమార్ హైదరాబాద్‌లో కోవిడ్ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. ఆయన మణుగూరు క్వారంటైన్ సైంటర్ ఇంఛార్జిగా వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.