యాప్నగరం

ఎమ్మెల్యే సీతక్కను వెనక్కి పంపించిన పోలీసులు

లాక్‌డౌన్ ప్రారంభమైన నాటి నుంచి మారుమూల ప్రాంతాల ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సీతక్కను భద్రాద్రి జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. నిత్యావసరాల పంపిణీకి అనుమతి లేదని తెలిపారు.

Samayam Telugu 9 May 2020, 2:48 pm
లాక్‌డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క గిరిజనులకు నిత్యావసరాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. కిలోమీటర్ల దూరం నడుస్తూ.. వాగులు, వంకటను దాటుతూ.. రాళ్ల గుట్టలను ఎక్కుతూ ఆమె మారుమూల ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. గిరిజనులకు సాయం చేయడం కోసం ఆమె పడుతున్న తపన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Samayam Telugu ఎమ్మెల్యే సీతక్క (పాత ఫొటో)


కాగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలంలోని గిరిజన గ్రామాలకు వెళ్లిన సీతక్కను పోలీసులు వెనక్కి పంపారు. నిత్యావసరాలను పంపిణీ చేయడానికి అనుమతి లేదన్నారు. గిరిజన ప్రాంతాల నుంచి ఆమెను వెనక్కి వెళ్లమని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.