యాప్నగరం

కరోనా ఎఫెక్ట్.. భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక సూచనలు

కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. విగ్రహాల ఎత్తు విషయంలో పోటీలు పడొద్దని కోరింది.

Samayam Telugu 27 Jul 2020, 4:07 pm
కరోనా వైరస్ ప్రభావం పండుగలు, శుభకార్యాలపైనా గట్టిగానే పడుతోంది. ఇప్పటికే రంజాన్ పండుగను నిరాడంబరంగా జరుపుకోగా... వినాయకచవితి పండుగను కూడా ఇలాగే జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కరరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి నగరవాసులకు సూచించింది. విఘ్నేశ్వరుడి పూజకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది.
Samayam Telugu వినాయకుడి విగ్రహం


గణేశ్ మండపాల ఏర్పాటు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. మండపంలో నలుగురైదుగురు మాత్రమే ఉండాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు సూచించారు. మండపంలో ఉండే వారంతా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు.

విగ్రహాల ఎత్తు గురించి పోటీలు పడొద్దని.. ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు. కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని భగవంతరావు సూచించారు. ఇంతకు ముందులా గణేష్ నవరాత్రులు ముగిశాక సామూహిక నిమజ్జనం సాధ్యం కాదన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. నిమజ్జనం చేయాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.